రావిర్యాలలో ఏటీఎం చోరి
Rangareddy: ATM theft in Raviriya

Rangareddy :రావిర్యాలలో ఏటీఎం చోరి
ఇబ్రహీంపట్నం- సూర్య టుడే :గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసిసుమారు రూ.29,69,900 లక్షల డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఎస్బిఐ ఎటిఎం వద్దకు కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి సిసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండ సెన్సార్ వైర్లను కత్తిరించారు . గ్యాస్ కట్టర్ఏటిఎం కట్ చేసి 4 నిమిషాల్లో ఏటిఎంలో ఉన్న డబ్బును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి, ఏసిపి కేపీవి రాజు, ఆదిభట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఏటిఎం ను పరిశీలించారు. ఏటిఎం లో సుమారు రూ.30 లక్షల ఉన్నట్టు ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ కొర్ర శ్రీవాణి తెలిపారు. కాగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు.