సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క

On
సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క

హైదరాబాద్, సూర్య టుడే :

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలో బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్ల పాటు పాలించిన వారు సంక్షేమ కార్పొరేషన్లను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కానీ తాము ప్రాధాన్యత రంగంగా భావిస్తున్నామని చెప్పారు. సబ్సిడీలు, మార్జిన్ మనీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి సుమారు రూ.6,000 కోట్ల విలువైన ఉపాధి పథకాలను మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో ప్రారంభిస్తారని, స్వయం ఉపాధి పథకాల పంపిణీ, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగలా నిర్వహిస్తుందని తెలిపారు. ఇవి రాష్ట్ర జీడీపిని పెంచుతాయని అన్నారు.రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకమని, ప్రపంచాన్ని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐ ల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, శాంతి భద్రతలు మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడమే కాదు చేసి చూపామని భట్టి తెలిపారు. ఈ ఒక్క రంగానికి 52,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు 22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాంకర్లకు మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా 22 వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని, సింగిల్ స్ట్రోక్ తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలి అన్నారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 11,500 కోట్లు, రైతు బీమా కింద 1,500 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద సబ్సిడీ మొత్తం 11 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా 1,800 కోట్లు, ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేశ ఆలోచనను ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వివరించారు. మహిళలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని భట్టి కోరారు. హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. హైదరాబాదు నగరానికి మూసీ నది మణిహారంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. మూసీ నదిని పునర్జీవింపజేసి ఆదాయంతో పాటు, పరిసరాల్లో నివసించే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మూసీ నది అభివృద్ధి క్రమంలో నిర్వాసితులు అయ్యే వారికి బ్యాంకర్లు ఆర్థికంగా చేయూతను అందించాలన్నారు. మూసి నిర్వాసిత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించినట్టు తెలిపారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ నగరంలో మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తామని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఇండస్ట్రియల్, ఫార్మా, హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయి అన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే MSME సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు ఆర్థిక చేయుత అందించాలని భట్టి కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని బడ్జెట్ కు ముందు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.. అందుకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.

Views: 25

Latest News

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌
Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు