పేదల భూములు గుంజుకోవద్దు

ప్రభుత్వం భూసేకర ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి.

On
పేదల భూములు గుంజుకోవద్దు

మాజీ సర్పంచ్ బండి మీద కృష్ణ డిమాండ్ 

 

యాచారం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములు గుంజుకుంటే ఊరుకోబోమని మాజీ సర్పంచ్ బండి మీద కృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. యాచారం మండల పరిధిలో మొండి గౌరెల్లి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 19, 68, 127 లో ఎక్కువమంది దళిత రైతులే ఉన్నారు. ఈ సర్వే నెంబర్లలో

821 ఎకరాల భూమి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేయాలని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినట్లు తెలిపారు. ఈ భూములను తరతరాలుగా దళితులు భూమిని దున్నుకొని జీవనం సాగిస్తున్నారు.అలాంటి పేద రైతుల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కంపెనీల పేరుతో భూములు పుంజుకోవడం ఆ గ్రామ రైతులందరూ ఖండిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపేయాలని డిమాండ్ చేశారు. మా ప్రాణాలు అడ్డుపెట్టైనా మా భూములను కాపాడుకుంటాం. కానీ ప్రభుత్వానికి ఇచ్చేది లేదని ఆ గ్రామస్తులు, రైతులు తేల్చి చెప్తారు. ఈ ఉద్యమంలో పార్టీలకతీతంగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Views: 57

Latest News

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
తుర్కయంజాల్- సూర్యటుడే:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం తుర్కయంజాల్ కూడలిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ...
పేదల భూములు గుంజుకోవద్దు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌
SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work
దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)
సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested