దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)

On
దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)

మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వేములవాడలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి్కి గౌరవం లేదన్నారు. జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని కేటీఆర్, బీఆర్ఎస్‌ వెనకుసుకు  రావడం సరికాదన్నారు. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు బిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యక్తి కావడం వల్లే స్పీకర్‌కు బీఆర్ఎస్‌ శాసనసభ్యులు గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా బీఆర్ఎస్ మార్చిందని ఆయన ఆరోపించారు. దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్‌ వ్యవహరిస్తుందన్నారు ఆదిశ్రీనివాస్‌. 
-------

Views: 70

Latest News

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
తుర్కయంజాల్- సూర్యటుడే:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం తుర్కయంజాల్ కూడలిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ...
పేదల భూములు గుంజుకోవద్దు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌
SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work
దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)
సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested