SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
ఆదినుంచి దళితులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ దళితులను ముందువరసలో నిలిపింది కాంగ్రెస్ పార్టీయే
3.jpg)
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. బాబూ జగ్జీవన్రామ్కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ- వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషకరం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం. వెంటనే ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించాం. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షవిూమ్ అక్తర్ కమిషన్ నియమించాం. కమిషన్.. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించింది. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించాం. 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా కమిషన్ విభజించింది. 59 కులాలు ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందని సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొప్ప విజయం లభించింది. ఇక, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’ స్వాతంత్యర్ర వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు
అండగా ఉంటోంది. దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. బిల్లును ఎకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు నా కృతజ్ణతలు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషం’ అని అన్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ణతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షవిూమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించింది. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి జనాభా 3.288గా ఉంది. వీరికి 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. మధ్యస్థంగా లబ్ధిపొందిన 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. వీరి జనాభా 62.748గా ఉంది. వీరికి 9శాతం రిజర్వేషన్ కల్పించారు. కాస్త మెరుగైన ప్రయోజనాలు పొందిన 26 కులాలను గ్రూప్ 3లో వేశారు. వీరి జనాభా 33.963గా ఉంది. వీరికి 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఏ,బీ,సీ,డీ, కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణను చేసే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం.. కమిషన్ సిపార్సుతో పాటు- ఎపిరికల్ డేటాను దృష్టిలో పెట్టుకుని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 ఉండగా.. మాలలు 55,70,244 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం మాలల జనాభా కంటే మాదిగల జనాభా 11.3 లక్షలు ఎక్కువ. ఎస్సీల్లో కేవలం ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకు ఉంటుందని ఓ అంచనా. అందరికీ కలిపి 15 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం కోటాలో మాలలే ఎక్కువ లాభం పొందుతున్నారనే గొడవ దశాబ్దాల క్రితమే మొదలైంది. 1972 నుంచి మాదిగ వర్గానికి చెందిన నేతలు ముఖ్యమంత్రుల్ని కలుస్తూ వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. మంద క్రిష్ణ మాదిగ కూడా దీనిపై ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు..’ 1996 నాటికి మాదిగలు 18 వేల ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80-90 శాతం నాల్గో తరగతి ఉద్యోగాలే. మరోవైపు, మాలలు అన్ని రకాలవీ కలిపి 72 వేల ఉద్యోగాల్లో ఉన్నారని అన్నారు