Telangana High Court:హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు కోటి జరిమానా

ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ చెంపపెట్టు

On
Telangana High Court:హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు కోటి జరిమానా



హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సంచలన తీర్పు వెల్లడిరచారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఆ విషయాన్ని దాచిన పిటిషనర్‌ మరో బెంచ్‌ వద్ద కొత్త పిటిషన్‌ వేసి ఆర్డర్‌ తీసుకున్నాడు. ఈ విషయం ధర్మాసనం దృష్టికి రావడంతో జస్టిస్‌ నగేశ్‌ ఆగ్రహించారు. ఉన్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. ఓ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా మరో బెంచ్‌ వద్ద రిట్‌ పిటిషన్‌ ఎలా వేస్తారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధించారు. కాగా, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ చెంపపెట్టు లాంటిదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు జస్టిస్‌ నగేశ్‌ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

Views: 109

Latest News